Duct-taped Banana Sold for $6.2 Million: గోడకు టేపుతో అతికించి ఉన్న ఈ అరటిపండుకు అక్షరాలా 52.7 కోట్లు. ఇదేదో అంత గొప్ప అరటిపండు ఏమీ కాదు మరి!

వెర్రి వెయ్యి విధాలు అంటారు పెద్దలు. మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. ఆకలేస్తే బండి మీద ఓ డజను అరటిపండ్లు కొంటాం. మహా అయితే, ఓ రూ. 60-70 ఇస్తాం. అయితే,

Duct-taped Banana Sold for $6.2 Million (Credits: X)

Newyork, Nov 22: వెర్రి వెయ్యి విధాలు అంటారు పెద్దలు. మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. ఆకలేస్తే బండి మీద ఓ డజను అరటిపండ్లు (Banana) కొంటాం. మహా అయితే, ఓ రూ. 60-70 ఇస్తాం. అయితే, న్యూయార్క్‌ (Newyork) లో బుధవారం జరిగిన వేలంలో ఒక అరటిపండుకు ఏకంగా ఓ వ్యక్తి 6.24 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 52.7 కోట్లు) చెల్లించాడు. పోనీ అదేదో ఔషద గుణాలు, సౌందర్యాన్ని అందించే లేదా వజ్రాలు పొదిగిన పండు కావొచ్చేమో అనుకుంటే అదీ లేదు. గోడకు టేపుతో అతికించి ఉన్న ఓ మామూలు అరటిపండు అది.

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో ఘోర అపచారం.. మంటల్లో హనుమాన్ విగ్రహం.. విగ్రహం దగ్ధమవ్వడం ఊరికి అరిష్టమంటున్న గ్రామస్తులు (వీడియో)

ఏం చేస్తాడో తెలుసా?

ఇటలీ విజువల్‌ ఆర్టిస్ట్‌ మౌరిజియో కాటెలన్‌ 2019లో ఇలాంటి అరటిపండును సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్‌ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు ‘కమెడియన్‌’ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ పండు వార్తల్లోకి ఎక్కగా తాజాగా దీనిని వేలం వేయగా రూ. 52.7 కోట్లకు అమ్ముడుపోయి మరోమారు హెడ్‌ లైన్స్‌ కు ఎక్కింది. చైనా పారిశ్రామికవేత్త జస్టిన్‌ సన్‌ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు. ఈ పండును తాను తింటానని జస్టిన్‌ సన్‌ పేర్కొనడం విశేషం. తినడం కోసం ఇంత డబ్బు తగలేయాలా? అని నెటిజన్లు వాపోతున్నారు.

గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement