Income Tax Relief Announced in Budget 2025: వేతన జీవులకు భారీ ఊరట..రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్(Nirmala Sitharaman On Income Tax) ప్రకటించారు
కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ట్యాక్స్ రిలీఫ్(Nirmala Sitharaman On Income Tax) ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర నిర్ణయంతో మధ్య తరగతికి బిగ్ రిలీఫ్ లభించనుంది.
సవరించిన ఆదాయపు పన్ను 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు(Income Tax Relief Announced in Budget 2025). రూ. 18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70 వేలు మిగులు, రూ.25 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. లక్ష మిగులు ఉండనుందని తెలిపారు నిర్మలా. కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. ఐటీ చెల్లింపు దారులకు ఎదురుచూపులే, ఎలాంటి ప్రకటన చేయని నిర్మలా, వచ్చే వారం ఆదాయపు పన్ను బిల్లు ఉంటుందని వెల్లడి
()0 నుంచి రూ.4 లక్షల వరకు ట్యాక్స్ లేదు
()రూ.4 లక్షలు – రూ.8 లక్షల వరకు 5 శాతం
()రూ.8 లక్షలు – రూ.12 లక్షల వరకు 10 శాతం
()రూ.12 లక్షలు – రూ.16 లక్షల వరకు 15 శాతం
()రూ.16 లక్షలు – రూ.20 లక్షల వరకు 20 శాతం
()రూ.20 లక్షలు – రూ.24 లక్షల వరకు 25 శాతం
()రూ.24 లక్షల పైన 30 శాతం
No income tax till income of rs 12 lakh says FM Nirmala Sitharaman
అలాగే ఐటీఆర్, టీడీఎస్ పరిమితి కూడా పెంచగా టీడీఎస్ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచారు.