Charmadi Waterfalls: స్నానం చేయడాన్ని నిషేధించినా.. జలపాతంలో పర్యాటకుల స్నానాలు.. బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. కర్ణాటకలో ఘటన (వీడియో వైరల్)
కొండ కోనలు, లోయలు, జలపాతాలు ఉన్న టూరిస్టు ప్రదేశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను చాలామంది పర్యాటకులు పట్టించుకోరు. కర్ణాటక ముడిగేరిలోని చార్ మడి జలపాతం వద్ద కూడా ఇలాగే నిషేధాజ్ఞలు పక్కనబెట్టి స్నానం చేస్తున్న కొందరు పర్యాటకులకు పోలీసులు విధించిన చిన్నపాటి శిక్షను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Newdelhi, July 15: కొండ కోనలు, లోయలు, జలపాతాలు ఉన్న టూరిస్టు ప్రదేశాలలో (Tourist Places) ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను చాలామంది పర్యాటకులు పట్టించుకోరు. అలా చేసే ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. కర్ణాటక (Karnataka) ముడిగేరిలోని చార్ మడి జలపాతం వద్ద కూడా ఇలాగే నిషేధాజ్ఞలు పక్కనబెట్టి స్నానం చేస్తున్న కొందరు పర్యాటకులకు పోలీసులు విధించిన చిన్నపాటి శిక్షను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
చార్ మడి జలపాతం జలపాతంలో స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించినా కొందరు స్నానాలు చేయడంతో వారు జలపాతం దిగువన ఉంచిన దుస్తులను పోలీసులు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో పర్యాటకులు తమ బట్టలు ఇచ్చేయాలంటూ అర్ధనగ్నంగా పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పర్యాటకులను హెచ్చరించిన అనంతరం పోలీసులు వారి బట్టలు ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.