Nagarkurnool Horror: నాగర్‌ కర్నూల్ లో దారుణం.. మద్యం తాగించి, ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం

నాగర్‌ కర్నూల్ లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యాపారాలు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌ ‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Crime Representational Image (File Photo)

Nagarkurnool, July 20: నాగర్‌ కర్నూల్ (Nagarkurnool Horror) లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యాపారాలు అత్యాచారానికి (Rape) పాల్పడ్డారు. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్‌ ‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, బల్మూర్ మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలు కూలీలుగా పనిచేస్తుంటారు. గురువారం వారు అచ్చంపేటకు పని కోసం రాగా పట్టణంలో బండల దుకాణాలు నిర్వహించే వినోద్ సింగ్, గజానంద్ సింగ్ తమ ఇంట్లో పని ఉందని కూలి మాట్లాడుకుని మహిళలను తీసుకెళ్లారు. ఇంటిని శుభ్రం చేయించుకున్నారు. అనంతరం వారికి మందు తగించి  మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement