ICC Champions Trophy 2025: టీమిండియాను పాకిస్తాన్‌ పంపే ప్రసక్తి లేదు, మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎమ్‌ఈఏ, ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని తెలిపిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా

వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని తెలిపారు

India Vs Pakistan (PIC@ BCCI X)

వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ శుక్లా మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఆటగాళ్ల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యం అని తెలిపారు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

వన్డే ఫార్మాట్లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో పాటు ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. సొంతగడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతోంది.టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతోంది.

టీమిండియాను పాకిస్తాన్‌ పంపే ప్రసక్తి లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎమ్‌ఈఏ) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎమ్‌ఈఏ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ ఆందోళనలు లేవనెత్తింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసింది. కాబట్టి భారత జట్టు అక్కడికి వెళ్లే అవకాశమే కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement