NDRF Foundation Day: ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆసక్తికర సన్నివేశం... పవన్ కళ్యాణ్ కోసం కుర్చీ వేయించిన షా, వీడియో ఇదిగో
NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శిలాఫలకం వద్ద ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకు కుర్చీలు ఉన్నాయి.
NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శిలాఫలకం వద్ద ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకు కుర్చీలు ఉన్నాయి. ఇది గమనించిన అమిత్ షా... వెంటనే మరో కుర్చీ తీసుకురావాలని ఆదేశించారు.
ఆ మరో కుర్చీలో పవన్ కళ్యాణ్ను కూర్చోవాలని సూచించారు అమిత్ షా. అంతే ఈ వీడియోను వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జనసైనికులు. ఈ వీడియో సైతం నెట్టింట్లో వైల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు, మోదీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ విషయంపై ఏపీ ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా అన్నారు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు NDRF ముందుంటుందని తెలిపారు. ఏపీ అభివృద్ధి మోదీ, చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రకృతి విపత్తులు సంభవిస్తే అండగా ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందన్న అమిత్ షా, వైసీపీ పాలన డిజాస్టర్ అని విమర్శ
NDRF 20th foundation day celebrations..