COVID in Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు, తాజాగా ఇద్దరు మృతి, కొత్తగా 232 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రొజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారీన పడి ఇద్దరు మరణించారని తెలిపింది. ఇవాళ కొత్తగా 232 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Coronavirus in India | (Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు రొజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1913 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారీన పడి ఇద్దరు మరణించారని తెలిపింది. ఇవాళ కొత్తగా 232 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87,456కు చేరగా ఇందులో ఇప్పటివరకు 6,75, 753 మంది కోటుకున్నారు. ఇప్పటివరకు 4036 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0. 58 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.27 శాతంగా ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement