Mohammed Shami: వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ క్రిమినెల్, అల్లా క్షమించడని తెలిపిన ముస్లిం మతాధికారి, దేశం కోసం అలా చేయడంలో తప్పు లేదని మండిపడిన బీజేపీ పార్టీ
భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్లో ఉపవాసం ఉండకపోవడం ద్వారా పాపం చేశాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం (మార్చి 6, 2025) అన్నారు.
మార్చి 4, 2025న దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ షమీ బంతిని సమ్ప్స్ వైపు విసిరాడు. భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్లో ఉపవాసం ఉండకపోవడం ద్వారా పాపం చేశాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం (మార్చి 6, 2025) అన్నారు.
షమీ ఓ క్రిమినల్ అంటూ విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కారణంగా షమీ రంజాన్ మాసంలో ''రోజా'' పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగుతూ, ఇతర కూల్ డ్రింక్స్ తాగుతూ కనిపించాడని షాబుద్దీన్ పేర్కొన్నాడు. ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాలను పంపుతుంది. రోజాని పాటించకపోవడం ద్వారా అతను నేరం చేశాడు. అతను అలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతను ఓ నేరస్తుడు. అతడు దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది'' అని ఓ వీడియో మెసేజ్లో షాబుద్దీన్ అన్నారు. షమీని విమర్శిస్తూ, రంజాన్ సందర్భంగా రోజా ప్రాముఖ్యతను వివరిస్తూ, ''ఆరోగ్యంగా ఉన్న ఏ పురుషుడు, స్త్రీ అయినా రోజా పాటించకపోతే, పెద్ద నేరస్తులు అవుతారు'' అని అన్నారు.
Mohammed Shami committed sin by not fasting
బిజెపి నాయకుడు మొహ్సిన్ రజా, ఆల్ ఇండియా ముస్లిం జమాత్కు చెందిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీని విమర్శించారు, దేవునికి మరియు తమకు మధ్య ప్రజలు తీసుకునే నిర్ణయాలలో జోక్యం చేసుకోవడానికి లేదా విమర్శించడానికి మత నాయకుడికి "హక్కు" లేదని అన్నారు. ఇది వ్యక్తికి మరియు అల్లాకు మధ్య ఉన్న విషయం, మరియు ముల్లా (షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ) మధ్యలో చెప్పే హక్కు లేదు. అతను (మహమ్మద్ షమీ) తన జాతీయ విధిని నెరవేర్చడానికి వెళ్ళాడు. మన మతం అలా చేయడానికి అనుమతి ఇస్తుంది" అని శ్రీ రజా అన్నారు.