Neeraj Chopra vs Arshad Nadeem: ఈ సారి దాయాదితో జావెలిన్ త్రో పోరు, ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో నువ్వా నేనా అన్నట్లు భారత్ స్టార్ నీరజ్ చోప్రాతో తలపడనున్న పాక్ స్టార్ అర్షద్ నదీమ్

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో సారి తన సత్తా చాటాడు. అమెరికాలోని యుజీన్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022 (World Athletics Championships 2022)ఫైనల్‌కు నీరజ్ చోప్రా చేరుకున్నాడు.

Neeraj Chopra Arshad Nadeem (Credit: Twitter)

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో సారి తన సత్తా చాటాడు. అమెరికాలోని యుజీన్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022 (World Athletics Championships 2022)ఫైనల్‌కు నీరజ్ చోప్రా చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నీరజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక అతడితో పాటు మరో భారత త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ కూడా ఫైనల్స్ కు చేరుకున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా (Neeraj Chopra) పతకం సాధిస్తే.. రెండో భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్‌ జంపర్‌ అంజూ బాబి జార్జ్‌ కాంస్య పతకం నెగ్గింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్‌ కేవలం ఒకే ఒక పతకం మాత్రమే సాధించింది. ఇక మ‌రో అథ్లెట్ రోహిత్ యాద‌వ్ కూడా ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. రోహిత్స్ త‌న జావెలిన్‌ను 80.42 మీట‌ర్ల దూరం విసిరాడు. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం ఫైన‌ల్ ఈవెంట్ జ‌ర‌గ‌నున్న‌ది.

వీడియో ఇదిగో.. కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్

పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (Pakistan at Global Javelin Throw ) కూడా ఫైనల్ కు అర్హత సాధించాడు.. ఈ నేపథ్యంలో ఈ సారి జావెలిన్ త్రోలో పాకిస్తాన్- ఇండియా మధ్య పోరు (Neeraj Chopra vs Arshad Nadeem) జరగబోతోంది. అయితే అర్షద్ నదీమ్ మొదటి రెండు త్రోలు క్వాలిఫైయింగ్ మార్కు 83.50 మీ కంటే తక్కువగా ఉన్నాయి. వాస్తవానికి, అతను 80 మీటర్ల మార్కు కంటే తక్కువగా ఉన్నాడు. ఇండియన్ అథ్లెట్లతో పోలిస్తే ఇది పేలవ ప్రదర్శన.అయితే అనూహ్యంగా పుంజుకుని చివరి త్రోను 81.71కి విసిరి ఫైనల్ కి అర్హత సాధించాడు.

పాకిస్తాన్ నుండి బయటకు వచ్చిన అత్యుత్తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో నదీమ్ ఒకడు మరియు గత కొన్ని సంవత్సరాలుగా నీరజ్‌తో పోటీని పంచుకున్నాడు. ఆసియా క్రీడలు 2018లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించినప్పుడు, నదీమ్ రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ తమ దేశ జాతీయ జెండాను తమ శరీరానికి చుట్టుకుని ఒకరినొకరు అభినందిస్తున్న పోడియంపై వారి ఫోటో అప్పట్లో వైరల్‌గా మారింది. ఇక టోక్యో 2020 బంగారు పతకం తర్వాత, ఒక ఇంటర్వ్యూలో నీరజ్ తన జావెలిన్ తీయడానికి వెళ్ళినప్పుడు, అది తప్పిపోయిందని, పాకిస్తాన్‌కు చెందిన నదీమ్ దానితో ప్రాక్టీస్ చేయడంలో బిజీగా ఉన్నాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు భారతదేశంలో వివాదం చెలరేగింది. పాకిస్థానీ ఆటతీరును గుర్తించిన భారత అభిమానులు దీనిపై తీవ్రంగా స్పందించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement