Vangalapudi Anitha On YS Jagan: జగన్‌ను జైల్లో వేయాలి, భద్రత తొలగింపుపై అన్నీ అబద్దాలే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందేనన్న ఏపీ హోంమంత్రి అనిత

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

Andhra Pradesh Home Minister Vangalapudi Anitha Sensational Comments On YS Jagan

Vij, Aug 12: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ ను సందర్శించినప్పుడు తాను ఎమోషన్ అయ్యానని...చేయని తప్పునకు చంద్రబాబును అన్యాయంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే స్నేహా బ్లాక్ లో ఉంచారని మండిపడ్డారు. రోజులన్నీ ఒకేలా ఉండవని, తప్పు చేయని వారు ఎవరైనా జైలుకి వెళ్లకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

మర్డర్ కు ప్రేరేపించిన వాడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలని...అదే పరిస్థితి కనుక వస్తే ఫస్ట్ జగన్ ను జైల్లో వేయాలన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందేనని ప్రస్తావించారు అనిత.

వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో తెలుసని, గురివింద గింజ తన నలుపు ఎరుగదని అన్నట్లు, వాళ్ల కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడటం మానేసి శాంతి భద్రతల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement