Vizianagaram Train Accident: రైలు ప్రమాద ఘటనపై పలు ప్రశ్నలను సంధించిన సీఎం జగన్, వెంటనే ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచన
బ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అలాగే సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది? వీటిపై నిజనిజాలు తెలుసుకోవాలని గౌరవనీయులైన ప్రధాన మంత్రిని, రైల్వే మంత్రిని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా కొన్ని సందేహాలను లేవనెత్తారు. సీఎం జగన్ ట్వీట్ చేస్తూ.. నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.రన్నింగ్లో ఉన్న మరో రైలును ఢీకొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని స్పష్టమైన ప్రశ్నలకు దారి తీస్తుందని అన్నారు.
రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులు కోలుకునే వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది, సీఎం జగన ట్వీట్ ఇదిగో..
బ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అలాగే సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది? వీటిపై నిజనిజాలు తెలుసుకోవాలని గౌరవనీయులైన ప్రధాన మంత్రిని, రైల్వే మంత్రిని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Here's CM Jagan Tweet
భవిష్యత్తులో ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు, ఈ లైన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. నా ఆలోచనలు, ప్రార్థనలు వారి ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణ అందించేలా మా ప్రభుత్వం కొనసాగుతుందని సీఎం జగన్ ట్వీట్ చేశారు.