AP Voter List: ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 45 లక్షల ఓట్ల తొలగింపు.. వెంటనే మీ ఓటు చెక్ చేసుకోండి..

ప్రజల సౌకర్యార్థం తొలగించిన ఓటర్ల జాబితాలను రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారుల అధికారిక వెబ్‌సైట్లలోనూ ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Voters List (Photo/File Image)

AP Voter List: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా పారదర్శకత, ప్రక్షాళన లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలన అనంతరం దాదాపు 45 లక్షల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3.71 కోట్ల మంది (89.22%) వివరాలను బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ తిరిగి నమోదు చేశారు. తొలగించిన ఓట్లలో ప్రతి వర్గం వివరాలు ఇలా ఉన్నాయి:

శాశ్వతంగా చిరునామా మారినవారు / గైర్హాజరైనవారు: 22.30 లక్షలు

మరణించిన ఓటర్లు: 15.22 లక్షలు

ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్నవారు (డ్యూప్లికేట్): 7.37 లక్షలు

మిగిలిన 44.89 లక్షల మంది నివాసాల్లో అందుబాటులో లేకపోవడం, వలస వెళ్లడం లేదా వివరాలు సమర్పించకపోవడం వల్ల ప్రస్తుతానికి ఎన్యుమరేషన్ పూర్తి కాలేదని అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు భారీ వర్షాల అలర్ట్.. ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..

బాధితులకు అవకాశం – క్లెయిమ్‌లు, అభ్యంతరాల షెడ్యూల్: జాబితా నుంచి పేర్లు తొలగిపోయిన అర్హులైన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఈఓ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక గడువును కేటాయించారు.

అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ: జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు

దరఖాస్తుల పరిశీలన & పరిష్కారం: జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు

ఓటర్ల తుది జాబితా ప్రచురణ: అక్టోబర్ 3

ఎలా దరఖాస్తు చేయాలి?: పేర్లు తొలగించబడిన వారు తగిన ఆధారాలతో పాటు ఫారం-6 (Form-6) డిక్లరేషన్ సమర్పించి తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారు తాము కోరుకున్న ఒకే నియోజకవర్గంలో ఓటును ఉంచుకునే వెసులుబాటు ఉంది.

పరిశీలనకు జాబితాలు అందుబాటులో: ప్రజల సౌకర్యార్థం తొలగించిన ఓటర్ల జాబితాలను రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారుల అధికారిక వెబ్‌సైట్లలోనూ ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బృహత్తర ప్రక్రియలో పాల్గొన్న 46,397 మంది బీఎల్ఓలు, అధికారులు, పొలిటికల్ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) ఈసీఐ అభినందించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement