Thalliki Vandanam Funds: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. తల్లికి వందనం నిధుల విడుదలపై కీలక అప్డేట్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే..
ఆంధ్రప్రదేశ్లో 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన మిగిలిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి మరో మూడు రోజుల్లో నగదును సజావుగా జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Thalliki Vandanam Funds: ఆంధ్రప్రదేశ్లో 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన మిగిలిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి మరో మూడు రోజుల్లో నగదును సజావుగా జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఇటీవల ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ నిర్ణయం ద్వారా పెద్ద ఊరట లభించనుంది.
వాస్తవానికి ఈ నిధులను ఆగస్టు 30వ తేదీనే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో జమ చేయాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడటంతో అధికారులు లబ్ధిదారుల ఎంపికపై పునఃసమీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించిన తుది జాబితాల పరిశీలన తుది దశకు చేరుకుంది. సచివాలయాల నుంచి అందిన లబ్ధిదారుల వివరాలను ఆర్థిక శాఖ సమగ్రంగా పరిశీలించిన వెంటనే, నేరుగా డీబీటీ (DBT) విధానంలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
విశాఖ మెట్రోపై కీలక అప్డేట్ .. 76.7 కి.మీ విస్తరణకు ప్రణాళికలు.. Phase-1 మెట్రో కారిడార్లు ఇవే..
ఈ విడత సహాయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇదివరకు నిర్వహించిన తనిఖీల్లో అర్హత కలిగి ఉండి కూడా సాంకేతిక లోపాలు లేదా ఇతర కారణాలతో నిధులు అందని విద్యార్థులకు సైతం ఈ దఫాలోనే నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా స్పష్టతతో ఇటు విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.