Brutal Murder in Telangana: దారుణం, నడిరోడ్డు మీద ఆటో డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపిన మరో డ్రైవర్, కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచిన కసాయి

హనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు.

Auto Driver Killed by another Driver in Broad Daylight in Hanamkonda (photo-VideoGrab)

Hyd, Jan 22:  హనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు. పైగా హత్య జరిగే దృశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

హైదరాబాద్ - వరంగల్ ప్రధాన హైవే వద్ద ఆదాల జంక్షన్ వద్ద ఆటోలో ఉన్న సమయంలో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి ఏనుగు వెంకటేశ్వర్లు తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి (Brutal Murder in Telangana) చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు.పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియోలు ఇవిగో, లోయలో పడిన ట్రక్కు, కూరగాయలు అమ్మేందుకు వెళుతున్న 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 15 మందికి గాయాలు

దీంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై నిందితుడు వెంకటేశ్వర్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది.

  Auto Driver Killed by another Driver 

స్థానికుల సమాచారం మేరకు సుబేదారి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement