Skill Development Scam: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌, 8 గంటల పాటూ వాదనలు విన్న తర్వాత కూడా ఎటూ తేల్చని న్యాయమూర్తి, ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కుంభంకోణం (Skill Development Scheme Scam) కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu Remand) విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

Chandababu Naidu Credits: X

Vijayawada, SEP 10: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కుంభంకోణం (Skill Development Scheme Scam) కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu Remand) విజయవాడ ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ కేసులో 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్‌ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అక్రమాల కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకుని రాత్రి సిట్‌ (SIT) కార్యాలయంలో విచారించింది. ఆదివారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Atchannaidu Audio Leak Video: అచ్చెన్నాయుడు ఆడియో లీక్ వీడియో ఇదిగో, బాబు అరెస్టయినా జనాలు పట్టించుకోవడం లేదు, మహిళలను తరలించాలని సూచన 

ఆ తర్వాత ఏసీబీ కోర్టులో (ACB Court) దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం, చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా బృందం వాదనలు వినిపించాయి. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. కోర్టులో వాదనల తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. అయితే, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో వైపు, చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement