CM Revanth Review on Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం.. అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, వెబ్ సైట్ ప్రారంభం, నిధుల సేకరణపై రివ్యూ
ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన అభయహస్తం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు.
Hyderabad, Jan 8: ప్రజాపాలనలో (Prajapalana) భాగంగా చేపట్టిన అభయహస్తం (Abhayahastham) ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు? వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, వెబ్ సైట్ ప్రారంభం, దరఖాస్తుల ప్రాసెసింగ్ కు అవసరమైన నిధుల సమీకరణ వంటివాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు.
వేటికి ఎన్ని దరఖాస్తులు?
గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకూ ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. మొత్తం 8 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. అభయహస్తం గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు వచ్చాయి.