CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్‌,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్

దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).

CM Revanth Reddy shocking comments on Chandrababu(Photo Credits - btTV)

Delhi, Jan 23:  దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). పీవీ నర్సింహ రావు(PV), చంద్రబాబు నాయుడుకి కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు కనీసం కంప్యూటర్ ఆన్, ఆఫ్ చేయడం కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..అల్లు అర్జున్(Allu Arjun) ఎపిసోడ్ గురించి సైతం ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు అని ప్రశ్నించగా అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు తెలియదు.. మొత్తం తెలుసుకొని మాట్లాడాలి అని రేవంత్ హితవు పలికారు.

తొక్కిసలాటలో మహిళ చనిపోతే, అల్లు అర్జున్ 10-12 రోజులు వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు అన్నారు రేవంత్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందన్నారు. కేటీఆర్(KTR) ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తాడు... నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు అన్నారు.  తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దావోస్(Davos) వేదికగా అతి పెద్ద ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు రానుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో భారీ MOU చేసుకుంది తెలంగాణ సర్కార్. ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులను నెలకొల్పనుంది సన్ పెట్రో కెమికల్స్.

CM Revanth Reddy shocking comments on AP CM Chandrababu

ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగం అవుతామని ప్రమాణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా తెలంగాణ పెవిలియన్ ను సందర్శించారు వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేష:  నిర్వాహకులు. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement