KTR On MLC Kavitha Bail: వచ్చే వారం కవితకు బెయిల్, కేటీఆర్ సంచలన కామెంట్స్,సుంకిశాల పాపం కాంగ్రెస్‌దేనని ఆరోపణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని వీలైతే వచ్చే వారమే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Delhi Liquor Scam, BRS KTR says MLC Kavitha may gets bail for next week(X)

Hyd, Aug 9: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని వీలైతే వచ్చే వారమే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

జైల్లో సౌకర్యాలు ఏమి లేవని, కవిత 11 కిలోల బరువు తగ్గారని తెలిపారు. 12 వేల మంది ఉండాల్సిన జైల్లో 30 వేల మంది ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే తాము న్యాయవాదులను కలిశామని వెల్లడించారు.

సుంకిశాల ఘటనపై బీఆర్ఎస్ ను నిందించడం సిగ్గు చేటు అని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రభుత్వం తప్పు లేకుంటే.. సుంకిశాల ఘటనను వారం రోజులపాటు ఎందుకు దాచి పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ఘటన జరిగిందని, ఇది ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి రేవంత్ వైఫల్యమేనని ఆరోపించారు.

బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో నీటి కోసం పోరాటం జరుగుతుందని, హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్ ముందు చూపుతో ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. తెలంగాణలో అమ్‌జెన్‌ బయోటెక్‌ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి 

శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సుంకిశాల ఘటన జరిగిందని .. 2వ తేదీన టన జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలిసి దాచిపెట్టారా? చెప్పాలన్నారు. గతంలో మేడిగడ్డ విషయాన్ని తాము రహస్యంగా ఉంచలేదని, ప్రమాదం జరిగిన గంటల్లోనే నిర్మాణ సంస్థ స్పందించిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే సభలో స్వీట్లు పంచిన నేతలు సుంకిశాల ఘటనపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement