Hyderabad Horror: నార్సింగిలో జంట హత్యల కేసు, అత్యంత దారుణంగా రేప్ చేసి బండరాయితో చంపేశారని అనుమానాలు, ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.

Couple Found Murdered on Narsingi Temple Hilltop

Hyd, Jan 14: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో మంగళవారం జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ కొండపై ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు.సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేందుకు కొండపైకి వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాలను గుర్తించి 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, దుండగులు పెద్ద రాళ్లను ఉపయోగించి బాధితులను దారుణంగా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. మహిళ హత్యకు గురైనట్లు నిర్ధారించబడగా, నేరం చేసిన తర్వాత వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే, పోలీసులు ఇతర అవకాశాలను తోసిపుచ్చలేదు. జంట హత్య కేసును బహుళ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పోలీసు బృందాలతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిమిత్తం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. డాగ్ స్క్వాడ్‌లు మరియు ఫోరెన్సిక్ నిపుణులు నేరం జరిగిన ప్రదేశం నుండి సాక్ష్యాలను సేకరిస్తూ కనిపించారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌‌లో మరో ఆత్మహత్య, హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విద్యార్థి

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి.. ఇద్దరూ దారుణహత్యకు గురైనట్టు గుర్తించారు. కత్తులతో పొడిచి అనంతరం బండ రాళ్లతో తలపై మోది హత్య చేసినట్టు ఆనవాళ్లున్నాయి. ఘటనా స్థలికి దూరంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేసే కూలీల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, షూస్‌ బట్టి చూస్తే నిర్మాణ సంస్థలో పనిచేసే కూలీగానే భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలు గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు.

గుర్తుతెలియని దుండగలు మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. అతని తలను బండరాయితో మోది హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తగలబెట్టారని తెలిపారు. ఇద్దరి మృతదేహాలు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ముందుగా మహిళపై హత్యాచారం చేసి అనంతరం అతడిని అంతమెుందించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున ఖాళీ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. నిందితులు మద్యం మత్తులో హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మరో ఘటనలో డ్రగ్స్‌ తీసుకెళ్తున్న నలుగురిని ఎల్‌బీ నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఐదు గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లెగూడకు చెందిన అజయ్, సూర్యాపేటకు చెందిన రాజు, సూర్యాపేటకు చెందిన దాసరి, కర్మన్‌ఘాట్‌కు చెందిన మహేందర్‌లుగా గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద రీతిలో తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement