Good News For Malls: రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ .. ఉద్యోగులు షిఫ్ట్‌కు మించి పనిచేస్తే అదనపు వేతనం.. రోజంతా తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాలని జీవో

వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వాటిని వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోను కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ రాణి కుముదిని ఇటీవల జారీ చేశారు.

TSPSC

Hyderabad, April 8: వ్యాపారులు, దుకాణదారులు, షాపింగ్స్ మాల్స్, రెస్టారెంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వాటిని వారంలో ఏడు రోజులూ 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవోను కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ రాణి కుముదిని ఇటీవల జారీ చేశారు. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 కింద పేర్కొన్న దుకాణాలు, సంస్థలకు సెక్షన్ 7 (దుకాణాలు తెరవడం, మూసివేసే గంటలు) నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా విధించింది.

Vande Bharat Train Charges: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ట్రైన్లో చార్జీలు ఎంతో తెలుసా? వివరాలు విడుదల చేసిన రైల్వే

నిబంధనలు ఏమిటంటే?

  • ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, దుకాణదారులు తమ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి.
  • వారాంతపు సెలవులు ఇవ్వడంతోపాటు వారానికి వారి పనిగంటలను నిర్దేశించాలి.

    షిఫ్ట్‌కు మించి పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.

  • ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేస్తే అందుకు సంబంధించిన వేతనం ఇవ్వాల్సి వస్తుంది.
  • మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి.
  • నైట్ షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి ముందుగానే వారి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది.
  • వారి రాకపోకలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
  • ఆయా షాపులు కచ్చితమైన రికార్డులు నిర్వహించాలి.
  • ఆదాయపన్నును సకాలంలో చెల్లించాలి.
  • 24 గంటలూ తెరిచి ఉంచే షాపులు వార్షిక రుసుముగా రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
  • పోలీసు యాక్ట్, రూల్స్‌ను అంగీకరిస్తేనే షాపులు 24 గంటలూ నిర్వహించుకునేందుకు అనుమతి లభిస్తుంది.

Modi Hyderabad Tour: ఈ సారి కూడా మోదీ టూర్‌కు కేసీఆర్ దూరం, మరోసారి తెరమీదకు ప్రోటోకాల్ వివాదాన్ని తీసుకువచ్చిన బీజేపీ 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement