TS BJP First List: 65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా??.. నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన వెలువడవచ్చంటూ ఊహాగానాలు.. నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Union Minister G. Kishan Reddy (Photo Credit: ANI)

Hyderabad, Oct 20: తెలంగాణలో (Telangana) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గరపడుతున్న వేళ బీజేపీ (BJP) కూడా దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల ఇన్‌ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో నిన్న జరిగిన రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పలుమార్లు చర్చించి జాబితాను సిద్ధం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ చార్జ్‌ లు తరుణ్‌ ఛుగ్, సునీల్ బన్సల్‌ తోపాటు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ చీఫ్ నడ్డా నివాసంలో గతరాత్రి జరిగిన సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు.

World Cup 2023: సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్, ప్రపంచకప్‌‌లో భారత్‌కు ఇది నాలుగో విజయం, బంగ్లాకు మూడో ఓటమి

మరో సమావేశం

ఈ ఉదయం 11 గంటలకు నడ్డాతో మరోమారు సమావేశమైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపిస్తారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా పాల్గొనే ఆ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారు.

కెఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవ్ చేస్తూ మిరాజ్‌ను పెవిలియన్ కి పంపిన భారత వికెట్ కీపర్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement