Good News To RTC Workers: ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, సమ్మె కాలానికి జీతాలు, కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు, మహిళలు రాత్రి 8 గంటలకే డ్యూటీ ముగించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) వరాలు ఇచ్చారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులతో కలిసి కేసీఆర్‌ భోజనం(Telangana CM KCR Lunch Meeting With RTC Employees) చేశారు. అనంతరం కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ(RTC)ని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు.

Telangana CM KCR Lunch Meeting With RTC Employees Regarding Telangana RTC Issues (Photo-Twitter)

Hyderabad,December 1: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) శుభవార్తను అందించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులతో కలిసి కేసీఆర్‌ భోజనం (Lunch Meeting) చేశారు. అనంతరం కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ(RTC)ని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు.

52 రోజుల సమ్మె (TSRTC Strike) కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని (September Salary) డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రగతి భవన్‌లో కార్మికులతో కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి మాత్రం ఆర్టీసీ జేఏసీ యూనియన్ నేతలను మాత్రం పిలవలేదు. మూడు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన కార్మికులకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లైంది.

మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాత్రి 8 గంటలకే విధులు ముగిసేలా మహిళా కార్మికులకు డ్యూటీ వేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులు వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారని సమాచారం.

ఆర్టీసీ సమస్యలు, స్థితిగతులపై ప్రభుత్వం తరఫున కేసీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని సమాచారం. ఆర్టీసీని లాభాల బాట పట్టించాలంటే ఏయే చర్యలు తీసుకోవాలనే దిశగా సీఎం కార్మికులతో చర్చలు జరిపారు. యూనియన్ల వైపు కార్మికులు వెళ్లొద్దని కేసీఆర్ సూచించారు. ఒక్కో డిపో నుంచి ఐదుగురి చొప్పున 90 డిపోల నుంచి 750 మంది కార్మికులు, 150 మంది అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు.

బస్సుల్లో టికెట్ తీసుకోకపోతే కండక్టర్‌కు విధిస్తున్న పెనాల్టీని ప్రయాణీకులపై వేయాలని డిసైడ్ అయ్యారు. ఆర్టీసీ మనుగడ కోసం కష్టించి పనిచేయాలని కార్మికులకు సూచించారు. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వీరికి డిపోల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని 52 రోజులుగా కార్మికులు చేసిన సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు కఠినంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్..కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని సూచించారు. దీంతో కార్మికుల్లో సంతోషం పెల్లుబికింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Review: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

Swarna Vimana Gopuram Maha Kumbhabishekam: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, స్వర్ణ విమాన గోపురం మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ఆహ్వానం

Share Now