Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!
ఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.
Tirumala, Oct 2: ఈ నెలాఖరులో తిరుమల (Tirumala) దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం (Lunar Eclipse) కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం (Srivari Temple) 8 గంటలపాటు మూతపడనుంది. 29న తెల్లవారుజామున 1.05 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 2.22 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ కాబట్టి 28న రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 3.15 గంటలకు శుద్ధి చేసి సుప్రభాత సేవల అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాతి నుంచి యథావిధిగా భక్తులను అనుమతిస్తారు.
ఈ ప్రత్యేక సేవలు రద్దు
సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనం 28న రద్దు చేశారు. అలాగే, పెరటాసి రద్దీ కారణంగా నేడు ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Advertisement
Advertisement
Advertisement