Predictions on End of Humanity: మానవాళి అంతంపై సంచలన నివేదిక వెలుగులోకి, సూపర్ ఖండం ఏర్పడి భూమి మీద మానవజాతి అంతరించిపోతుందని అధ్యయనంలో వెల్లడి

మానవ జాతి అంతంపై సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు

Planet (Photo-Pixabay)

Supercomputer predicts on end of humanity: మానవ జాతి అంతంపై సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తేలింది.

అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్‌వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ డేంజర్ గా మారుతుందని అన్నారు. దీని ద్వారా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్‌ విడుదల కానుందని అన్నారు. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని హెచ్చరించారు. ఈ వేడి "తరచుగా అగ్నిపర్వత విస్ఫోటనాలతో" ఒక సూపర్ ఖండం యొక్క ఆవిర్భావానికి మార్గం సుగమం చేస్తుంది.

పాకిస్తాన్‌‌లో కొత్త వ్యాధి కలకలం, మెదడును తినే అమీబా బారీన పడి 11 మంది మృతి, ముక్కు ద్వారా శరీరం లోపలకి వెళుతున్న నేగ్లేరియా ఫౌలెరి

సూపర్ ఖండం ప్రధానంగా వేడి మరియు తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. తత్ఫలితంగా, భూమి యొక్క గణనీయమైన భాగం 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను అనుభవించవచ్చు . ఏర్పడే కొత్త సూపర్ ఖండం మూడు రెట్లు ముప్పును కలిగిస్తుంది, ఖండం ప్రభావం, తీవ్రతరం చేయబడిన సౌర ఉత్పత్తి, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క అధిక సాంద్రత కలిగి ఉంటుంది. అదే సమయంలో, గ్రహం యొక్క చాలా భాగం మండే వేడితో బాధపడుతుంటుంది.

ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్‌వర్త్ హెచ్చరించారు. అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు.

లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో భూమిపై నివాసయోగ్యంకాని సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement