Pakistan Horror: పాకిస్తాన్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్, ఇస్లాం మతంలోకి రాలేదని కిడ్నాప్, 3 రోజులు బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ సామూహిక అత్యాచారం

పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. మతం మారలేదని హిందూ మహిళపై కామాంధులు (Married Hindu woman abducted, gang-raped) తెగబడ్డారు. మూడు రోజుల పాటు రూంలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

Sindh, Jan 30: పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. మతం మారలేదని హిందూ మహిళపై కామాంధులు (Married Hindu woman abducted, gang-raped) తెగబడ్డారు. మూడు రోజుల పాటు రూంలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనను కిడ్నాపర్లు ఇస్లాంలోకి మార్చాలని బెదిరించారని ( refusing to convert to Islam) సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో బాలిక తెలిపింది. ఉమర్‌కోట్ జిల్లాలోని సమారో పట్టణంలో తనపై అత్యాచారం జరిగిందని, మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి అనుమానితులపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని ఆమె పేర్కొంది.

ఆదివారం వరకు, మిర్‌పుర్‌ఖాస్‌లోని పోలీసులు బాలిక పేర్కొన్న నిందితులపై కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారని హిందూ స్థానిక నాయకుడు ఒకరు తెలిపారు.అమ్మాయి,ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్ వెలుపల కూర్చున్నారు, కానీ ఇంకా ఎటువంటి కేసు నమోదు కాలేదు" అని నాయకుడు చెప్పారు.

 భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానం, మద్యం తాగించి ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి, మృతదేహాన్ని 15 ముక్కలుగా కట్ చేసిన భర్త, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

మూడు రోజుల పాటు యధేచ్చగా ఈ దారుణం జరిగింది. ఆ తర్వాత ఆ కామాంధుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. నన్ను ఇస్లాంలోకి మారాలంటా ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మోంగ్రియో, వారి సహచరులు బెదిరించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో వారు నన్ను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు అత్యాచారం చేసారు. చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపాను. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం వాళ్లు పట్టించుకోలేదు" అని బాధితురాలు ఆరోపించారు.

థార్, ఉమర్‌కోట్, మిర్‌పుర్‌ఖాస్, ఘోట్కీ మరియు ఖైర్‌పూర్ ప్రాంతాలలో హిందూ జనాభా అధికంగా ఉన్న సింధ్‌లోని అంతర్భాగంలో హిందూ యువతులను అపహరించడం, బలవంతంగా మతమార్పిడి చేయడం పెద్ద సమస్యగా మారింది. హిందూ సమాజం సభ్యుల్లో ఎక్కువ మంది కూలీలుగా ఉన్నారు. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇలాంటి సంఘటనలు తరచుగా నివేదించబడిన అనేక సందర్భాలు నిర్దిష్ట ప్రాంతంలో ఉన్నాయి.

భార్య రావడం లేదని పురుషాంగం కట్ చేసుకున్న భర్త , తీవ్ర రక్త స్రావం కావడంతో ఆస్పత్రికి, కుట్లు వేసిన వైద్యులు, శృంగారానికి పనికివస్తాడా లేదా అనేది చెప్పడం కష్టమని వెల్లడి

గతేడాది జూన్ 2022 తనను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని హిందూ యువతి కరీనా కుమారి ఇక్కడ కోర్టుకు తెలిపింది. గత ఏడాది మార్చిలో, ముగ్గురు హిందూ బాలికలు - సత్రన్ ఓడ్, కవీతా భీల్, అనితా భీల్ - కిడ్నాప్ చేయబడి, ఇస్లాం మతంలోకి మార్చబడ్డారు. ఎనిమిది రోజుల్లో ముస్లిం పురుషులతో వివాహం చేసుకున్నారు.

గత ఏడాది మార్చి 21న మరో కేసులో సుక్కూర్‌లోని రోహ్రీలోని తన ఇంటి బయట పూజా కుమారిని దారుణంగా కాల్చి చంపారు. స్పష్టంగా, ఒక పాకిస్తానీ వ్యక్తి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కాల్పులు జరిపారు.

గోరీ కోహ్లీ, నలుగురు పిల్లల తల్లి, సింధ్‌లోని ఖిప్రో నుండి కిడ్నాప్ చేయబడింది. తరువాత ఆమె ఇస్లాం మతంలోకి మారిందని. ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐజాజ్ మర్రిని వివాహం చేసుకుంది.యువతీయువకులే కాదు, వృద్ధులైన హిందూ మహిళలు కూడా అపహరణలు, బలవంతపు మతమార్పిడుల బారిన పడ్డారు.2020 డేటా ప్రకారం పాకిస్తాన్ జనాభాలో హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలు కేవలం 3.5 శాతం మాత్రమే ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement