Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు

ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Representational (Twitter/ANI)

Hyderabad, April 21: ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన (Sumitra Pampana) ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ (Hyderabad) శ్రీనగర్ కాలనీలో (Srinagar Colony) నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు (Case) నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌ మెంట్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ముగిసిన గడువు.. బిడ్లు దాఖలు చేసిన 29 సంస్థలు.. ఊరించి, ఉసూరుమనిపించిన కేసీఆర్ సర్కారు.. బిడ్డింగ్ కు దూరంగా తెలంగాణ ప్రభుత్వం

అటు ఢిల్లీకి వెళ్ళగానే..

ఈ నెల 17న సుమిత్ర ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆమె ఫ్లాట్ తాళాలను అదే అపార్ట్‌ మెంట్‌లో నివసిస్తున్న సోదరుడు విజయ్ కుమార్‌కు ఇచ్చారు. అదే రోజు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు 293 గ్రాముల వెండి వస్తులను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతి రోజు ఉదయం దొంగలు పడిన విషయాన్ని గుర్తించిన సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్ ఢిల్లీలో ఉన్న ఆమెకు సమాచారం అందించారు.

Poonch Attack: పూంచ్ దాడి మా పనే.. ప్రకటించిన జైషే మహ్మద్.. ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు.. గ్రనేడి దాడి కారణంగానే వాహనంలో మంటలు.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement