
Hyderabad, Mar 8: ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు (Hotels), రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఈ క్రమంలో పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ హోటల్స్ లో తనిఖీలు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అమీర్ పేటలోని అమోఘ, తాజా కిచెన్, మెహిదీపట్నంలోని 4 సీన్స్ మల్టీకజిన్ రెస్టారెంట్ లో తనిఖీ చేశారు. ఆయా హోటల్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
Here's Video:
టోలిచౌకి 4 సీజన్స్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్
వెజ్, నాన్వెజ్ ఒకే దగ్గర మిక్స్ చేసి వంటలు.. కిచెన్లో బొద్దింకలు
వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర కలిపి నిల్వ చేస్తున్న రెస్టారెంట్ యాజమాన్యం pic.twitter.com/DPgL8Qy4xt
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2025
హోటల్స్ లో ఏం గమనించారు?
అధికారులు తాజాగా రైడ్స్ చేసిన హోటల్స్, రెస్టారెంట్స్ లో వెజ్, నాన్వెజ్ ఒకే దగ్గర మిక్స్ చేసి వంటలు చేస్తున్నట్టు తేలింది. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర కలిపి నిల్వ చేస్తున్న రెస్టారెంట్ యాజమాన్యాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలంచెల్లిన వస్తువులు కూడా గుర్తించారు.