Madhya Pradesh Accident: అయ్యో పాపం! మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, దీపావళి కోసం ఇంటికి వెళ్తూ నిద్రలోనే కన్నుమూసిన 15 మంది కూలీలు, చావుబ్రతుకుల మధ్య మరో 40 మంది, లారీ ఢీకొట్టడంతో నుజ్జు నుజ్జయిన బస్సు
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు (Bus) అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు (15 killed). మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Bhopal, OCT 22: మధ్యప్రదేశ్లోని రీవా (Rewa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు (Bus) అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు (15 killed). మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయింది. దీంతో అందులో నలుగురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు పోలీసులు శ్రమించారు. గాయపడ్డవారిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు.
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, మృతులంతా ఉత్తరప్రదేశ్ (Uttara pradesh), బీహార్ (Bihar) రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు. వీళ్లంతా ఒకే కంపెనీలో కూలి పనిచేసుకునేవారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.