Andhra Pradesh Shocker: మూడో తరగతి చిన్నారిని స్కూలు రూంలోకి తీసుకువెళ్లి టీచర్ దారుణం, తొడ కొరుకుతూ తాకరాని చోట తాకుతూ నీచ ప్రవర్తన

ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్‌ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.

Representational Image (File Photo)

Kodur, Nov 5: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడైన టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. సమాజం సిగ్గుపడే ఈ ఘటన వివరాల్లోకెళితే.. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచే­స్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపా­లరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్‌ టీచర్‌ను నియమించుకుని అక్కడి విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు.

వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే బాలిక బట్టలు విప్పి అత్యాచారం చేయబోయిన కామాంధుడు, గుడి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై దారుణం

ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ ఆ పాపను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్‌ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది.దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement