Rajkot Shocker: సెక్స్ కోసం ఏకంగా రూ. 1.29 కోట్లు హాంఫట్, అయినా పని కాలేదు, మోసపోయిన తరువాత పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, దర్యాప్తు ప్రారంభించిని పోలీసులు, గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో ఘటన

Sex (Photo Credits: The Noun Project and File)

Rajkot, June 12: గుజరాత్ లోని రాజ్‌కోట్ జిల్లాలోని గొండాల్ పట్టణానికి చెందిన 51 ఏళ్ల వ్యాపారికి సైబర్‌ నేరగాళ్లు ఏకంగా 1.29 కోట్ల రూపాయలు (Rs 1 crore to sex racketeers) టోకరా పెట్టారు. మొబైల్ కి హై ప్రోఫైల్‌ మహిళలతో డేటింగ్‌, శృంగారం కావాలంటే సంప్రదించండి అనే మెసేజ్ ద్వారా ఆ వ్యాపారి సైబర్ వలలో చిక్కుకుని మొత్తం పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించాడు. TOI కథనం ప్రకారం రాజ్‌కోట్‌ జిల్లా గోండల్‌ పట్టణానికి చెందిన అశ్విన్‌ విసారియాకు ఎర్త్‌ మూవింగ్‌ మిషిన్లతో పాటు బాగా పొలంకూడా ఉంది.

గత ఏడాది ఫిబ్రవరిలో, విజారియా (Gondal businessman) తన మొబైల్‌లో డేటింగ్ మరియు ఉన్నత మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకోవటానికి ఆసక్తి ఉందా అని మోసగాళ్లు అడిగారు. విస్రియా సానుకూల సమాధానం ఇచ్చిన తరువాత, మోసగాళ్ళు అతనిని వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించారు మరియు డేటింగ్ క్లబ్ సభ్యత్వ రుసుముగా ఆమె రూ .2,500 చెల్లించమని కోరారు.కొద్దిరోజులకు మరింత డబ్బు చెల్లించి అందులో వీఐపీ మెంబర్‌ అయ్యాడు.

స్నేహితుడని నమ్మితే న్యూడ్ వీడియోలు పంపమన్నాడు, లేకుంటే ఫోటోలు ఇంటర్నెట్లో పెడతా అన్నాడు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, మరో చోట ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేసిన ఓ కసాయి తల్లి

అతను ప్రతిఫలంగా ఏమీ పొందలేదు. ఈ నేపథ్యంలో విసారియా (Ashwin Visaria) డబ్బును వాపసు చేయాలని కోరాడు. నిందితులు డబ్బులు తిరిగి చెల్లించకపోగా.. మరో కొత్త స్కీము గురించి చెప్పారు. తమ స్కీములో డబ్బులు పెట్టుబడిగా పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. మోసగాడి మాటలు నమ్మిన అతడు ఈ సారి భారీ మొత్తాలను పెట్టుబడిపెట్టి మోసపోయాడు. మొత్తంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలువురిపై మోసం, నేర కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

క్రూర మృగాలైన కామాంధులు, యువతికి కామోద్దీప‌నాలు కలిగించే ఇంజెక్ష‌న్లు, ట్యాబెట్లు ఇస్తూ 8 ఏళ్లుగా అత్యాచారం, 27 పేజీలతో ఫిర్యాదు చేసిన బాధితురాలు, ముంబై నంగరంలోని అంధేరిలో దారుణ ఘటన

డానిష్ పటేల్, కేరాజ్ భాటి, ఆర్థ్ యాగ్నిక్, శివ బక్షి, అభిషేక్ ఆంటోనీ, కమలేష్, కౌషల్, అల్పేష్, కేశవ్ రోహన్, పవార్, నిమేష్ సోని మరియు రమేష్ లతో సహా 14 మందిపై గోండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం మరియు నేరపూరిత కుట్రతో సహా వివిధ విభాగాల కింద వీరిపై కేసు నమోదైంది.విసారియా డబ్బు జమ చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, అతనికి కాల్స్ వచ్చిన మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement