Coronavirus in India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా తీవ్రత, 415కు చేరిన ఒమిక్రాన్ కేసులు, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

భారత్‌లో కరోనా(Corona) తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,189 మందికి కరోనా నిర్ధారణ(Covid-19) అయింది. 387మంది మరణించారు. అయితే కరోనా కొత్త కేసుల కంటే రికవరీలు(Recoveries) ఎక్కువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 7,286 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus Outbreak (Photo credits: IANS)

New Delhi December 25: భారత్‌లో కరోనా(Corona) తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,189 మందికి కరోనా నిర్ధారణ(Covid-19) అయింది. 387మంది మరణించారు. అయితే కరోనా కొత్త కేసుల కంటే రికవరీలు(Recoveries) ఎక్కువగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 7,286 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 77,032 యాక్టీవ్ కేసులు(Corona Active cases)న్నాయి.

COVID 3rd Wave: ఒమిక్రాన్ దడ, దేశంలో 2022 ఫిబ్రవరి 3 నాటికి థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు, భారత్ లో 300కి చేరువలో కొత్త వేరియంట్ కేసులు

అటు పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్(Omicron variant) వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న పలు రాష్ట్రాల్లో భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కి చేరాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా కొనసాగుతోంది. దేశంలో 141 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement