
ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితా తాజాగా విడుదలైంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ రూపొందించిన ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ ప్రకారం, ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత టాప్–20 నగరాల జాబితాలో **13 నగరాలు భారతదేశం నుంచే** ఉండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది.
ఈ జాబితాలో అత్యంత కలుషిత నగరంగా **అస్సాంలోని బైర్నిహాట్** అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దేశ రాజధాని **ఢిల్లీ**, పంజాబ్లోని **ముల్లన్పుర్**, హర్యానాలోని **ఫరీదాబాద్, ఘజియాబాద్, న్యూ ఢిల్లీ**, **గురుగ్రామ్**, **గంగానగర్**, **గ్రేటర్ నోయిడా**, **భివాడి**, **ముజఫర్నగర్, హనుమాన్గఢ్, నోయిడా** వంటి నగరాలు ఉన్నాయి.
భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
ప్రత్యేకంగా **ఢిల్లీ** ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా నిలవడం గమనార్హం. 2023లో ఇదే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ ప్రపంచంలోని **మూడో అత్యంత కలుషిత దేశంగా** నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన నివేదికలో ఐదో స్థానానికి పడిపోవడం స్వల్పమైన మెరుగుదలకే సంకేతం అయినప్పటికీ, దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇంకా పెద్ద ఎత్తున చర్యలు అవసరం.