Air Pollution: బాబోయ్ వాయు కాలుష్యం.. 2021 ఒక్క ఏడాదిలోనే 21 లక్షలమంది మరణం.. అమెరికా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్ స్టిట్యూట్ సంస్థ వెల్లడి
చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా? కాలుష్యంతో కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Newdelhi, June 20: చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి (Delhi) వెళ్లారా? కాలుష్యంతో (Air Pollution) కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నిబట్టి దేశంలో వాయు కాలుష్యం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీని కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. భారత్ లో 21 లక్షలమంది మరణించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
#AirPollution caused 8.1 million deaths in 2021 globally, 2.1 million in #India: Reporthttps://t.co/CPp7kt3FbK
— Economic Times (@EconomicTimes) June 19, 2024
వాయుకాలుష్యంతో మరణాలు ఇలా
- ప్రపంచవ్యాప్తంగా మరణాలు- 81 లక్షలు
- చైనాలో మరణాలు - 23 లక్షలు
- భారత్ లో మరణాలు - 21 లక్షలు
ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలు ఇలా
- భారత్ - 1,69,400
- నైజీరియా - 1,14,100
- పాకిస్థాన్ - 68,100
- ఇథియోపియా - 31,100
- బంగ్లాదేశ్ - 19,100
(The above story first appeared on LatestLY on Jun 20, 2024 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

