Air Pollution (Credits: X)

Newdelhi, June 20: చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి (Delhi) వెళ్లారా? కాలుష్యంతో (Air Pollution) కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నిబట్టి దేశంలో వాయు కాలుష్యం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీని కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు  అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. భారత్‌ లో 21 లక్షలమంది మరణించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.

డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!

వాయుకాలుష్యంతో మరణాలు ఇలా

  • ప్రపంచవ్యాప్తంగా మరణాలు- 81 లక్షలు
  • చైనాలో మరణాలు - 23 లక్షలు
  • భారత్‌ లో మరణాలు - 21 లక్షలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు, అంతా అనుకున్న‌ట్లుగానే శ్రీ‌ల‌క్ష్మికి షాక్, గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న చాలా మందికి స్థాన‌చ‌లనం

ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలు ఇలా

  • భారత్‌ - 1,69,400
  • నైజీరియా - 1,14,100
  • పాకిస్థాన్‌ - 68,100
  • ఇథియోపియా - 31,100
  • బంగ్లాదేశ్‌ - 19,100