Case Against Kris Gopalakrishnan: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు.. మరో 17 మందిపై కూడా.. ఎందుకంటే??

దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనది. బెంగళూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు.

Kris Gopalakrishnan (Credits: X)

Newdelhi, Jan 28: దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ (Kris Gopalakrishnan) పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనది. బెంగళూరు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఐఐఎస్ సీ డైరెక్టర్ బలరాం సహా మొత్తం పద్దెనిమిది మందిపై సదాశివనగర్ పోలీసులు కేసు పెట్టారు. 2014లో తనను అన్యాయంగా హనీట్రాప్ కేసులో ఇరికించి ఉద్యోగంలో నుంచి తొలగించారంటూ ఐఐఎస్ సీ మాజీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. క్రిస్ గోపాలకృష్ణన్ సహా మరో 17 మందిపై ఆయన అభియోగాలు మోపారు. వీటిపై 71 సిటీ సివిల్, సెషన్స్ కోర్టు విచారించింది. చివరకు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై క్రిస్ గోపాలకృష్ణన్ కానీ ఐఐఎస్ సీ బృందం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆరోపణలు ఏమిటంటే?

ఫిర్యాదుదారు దుర్గప్ప బోవి కమ్యూనిటీ (గిరిజన)కి చెందినవారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనను హనీట్రాప్ కేసులో ఇరికించారని ఆరోపించారు. అనంతరం తనను కులం పేరుతో దూషించడంతో పాటు బెదిరింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. మొత్తం పద్దెనిమిది మందిపై ఫిర్యాదు చేశారు.

ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్‌ లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement