Tamil Nadu Shocker: యువతిని పొదల్లోకి లాక్కెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, బయట పెడితే హత్య చేస్తానని బెదిరింపు, తమిళనాడులో దారుణ ఘటన

తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు (Vellore) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్పాప్‌ చేసి, ఆపై ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన కత్తారి కుప్పం గ్రామంలో చోటు చేసుకుంది.

Representative image

Vellore, Nov 9: తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు (Vellore) గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్పాప్‌ చేసి, ఆపై ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన కత్తారి కుప్పం గ్రామంలో చోటు చేసుకుంది.వేలూరు పోలీసులు తెలిపిన కథనం మేరకు.. ఒడుగత్తూరు సమీపంలోని మేల్‌ అరసంబట్టు పంచాయతీలోని కత్తారి కుప్పం గ్రామానికి చెందిన శరత్‌కుమార్‌(27) ఊసూరు వద్ద ఉన్న ఒక బేకరి దుకాణంలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమై ఆ ఆడపిల్ల కూడా ఉంది.

పక్కనే ఉన్న ఊసూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి గుడియాత్తంలోని కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో విద్యార్థిని శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ఊసూరులోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలో శరత్‌కుమార్‌ కన్ను ఆమెపై పడింది. ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం (Attempt raped in Vellore) చేయాలని నిర్ణయిచుకుని, ఏడాదిగా ఆ విద్యార్థిని ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను వెంబడిస్తున్నాడు.

రాత్రిపూట రోడ్డుపై కామాంధులు, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న బాలికను స్కూలు వెనకకు లాక్కెళ్లి అత్యాచార యత్నం, బాలిక కేకలు వేయడంతో పారిపోయిన రేపిస్టులు

ఆదివారం సాయంత్రం విద్యార్థిని వస్త్రదుకాణంలో పని ముగించుకుని, బస్సు కోసం వేచి ఉన్న సమయంలో శరత్‌కుమార్‌ అక్కడ వేచి ఉంటూ ఎవరూ లేని సమయంలో విద్యార్థిని చేతులు పట్టుకుని ముళ్ల చెట్ల మధ్యకు తీసుకెళ్లడంతో (Woman abducted) విద్యార్థిని కేకలు వేసింది. వెంటనే చేతులు కట్టి, నోట్టో గుడ్డపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట పెడితే హత్య చేస్తానని బెదిరించాడు. అనంతరం జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి పొక్సో చట్టం కింద అరెస్టు చేసి, సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement