Justice: రూ.20 కోసం 22 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు.. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు.. న్యాయం ప్రధానం అంటున్నాడు.. ఏంటా సంగతి?

రూ.20 కోసం 22 ఏళ్ల పాటు న్యాయపోరాటం.. ఆసక్తిగా మారిన ఓ లాయర్ సక్సెస్ స్టోరీ..

Justice

NewDelhi, August 14: మధుర(madhura)కు చెందిన తుంగనాథ్‌ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్‌లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్‌ ధర రూ.70 కాగా టిక్కెట్‌ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. ఈ ఘటన డిసెంబర్‌ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్‌ మాస్టర్‌ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఎన్టీఆర్, చరణ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌! మీరు కూడా ఫిదా అవుతారు..

దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వే (Indian Railway)కి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని (వడ్డీతో కలిపి) ఆదేశించింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. రూ. 20 కోసం తాను ఈ పోరాటం చేయలేదని, న్యాయం (Justice) కోసమే ఇదంతా చేశానని తెలిపాడు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement