Covid in India: దేశంలో గత 24 గంటల్లో 3157 కరోనా కేసులు, 19,500 కేసులు యాక్టివ్‌, గత 24 గంటల్లో 26 మంది మృతి

దేశంలో గత 24 గంటల్లో 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో గత 24 గంటల్లో 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించగా, 2723 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. దేశ రాజధానిలో 1485 కేసులు రికార్డయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇక ఇప్పటివరకు 1,89,23,98,347 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో ఆదివారం 4,02,170 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement