Earthquakes in Rajasthan: వరుస భూకంపాలతో వణికిపోయిన జైపూర్.. తెల్లవారుజామున 4.09 గంటల నుంచి 4.26 గంటల మధ్య మూడు భూకంపాలు.. ఏం జరుగుతోందో తెలియక హడలిపోయిన ప్రజలు

వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని జైపూర్ వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Jaipur, July 21: వరుస భూకంపాలతో రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.26 గంటల మధ్య మూడు భూకంపాలు (Earthquakes) సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక హడలిపోయారు. కొందరు రోడ్లపైకి పరుగులు పెట్టారు. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Sabitha Indra Reddy: పిల్లలు స్కూల్స్ కు వెళ్లాక.. హాలీడే ఇస్తే లాభమేంటి మేడం.. మంత్రి సబితకు వరంగల్ పేరెంట్ ఫోన్.. రోజులానే తుంపర్లు పడతాయనుకున్నామన్న సబిత.. అసలేంటి విషయం??

Pushpa-2 Dialogue Leak: అభిమానులకు అల్లు అర్జున్ ఊహించని సర్‌ ప్రైజ్.. పుష్ప-2 డైలాగ్ తో సందడి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ‘బేబీ’ ఈవెంట్‌లో ఘటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement