MBBS Students Fight Video: వీడియో ఇదిగో, క్లాస్ రూంలోనే చితకబాదుకున్న కాబోయే డాక్టర్లు, ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో గ్రూపు వార్, కేసు నమోదు చేసిన పోలీసులు
ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో కొంత మంది మెడికల్ విద్యార్థులు క్లాస్ రూమ్లోనే కొట్టుకున్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు క్లాస్ రూంలోనే చితకబాదుకున్నారు.ఈ ఘర్షణలో కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు
ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో కొంత మంది మెడికల్ విద్యార్థులు క్లాస్ రూమ్లోనే కొట్టుకున్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు క్లాస్ రూంలోనే చితకబాదుకున్నారు.ఈ ఘర్షణలో కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు, ముఖంపై గాయాలు కావడంతో పలువురు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు.సమగ్ర దర్యాప్తు చేసి ఇరువర్గాలకు చెందిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.
‘కొంత మంది విద్యార్థులు మద్యం తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో.. ఈ ఏడాది ఆగస్టులో కళాశాల ప్రిన్సిపల్, కమిటీ వారు విచారణ జరిపి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. వారిని హాస్టల్ నుంచి బయటకు పంపించేశారు. హాస్టల్ బయట నుంచే వారు తరగతులకు హాజరవుతున్నారు. వాళ్లు ఆ విధంగా హాస్టల్లో లేకుండా చేయడానికి కారణమైన కొంత మంది విద్యార్థులపై సస్పెండ్ అయిన విద్యార్థులు కక్ష పెంచుకున్నారని డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.అందులో భాగంగానే దాడి జరిగిందని డీఎస్పీ తెలిపారు.
Here's Video