Andhra Pradesh: ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆస్పత్రిలో ఘటన, మృతురాలి బంధువుల ఆందోళన
ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది
ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం(Andhra Pradesh) నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన కట్టా దుర్గా మల్లేశ్వరి(27).
జనరల్ చెకప్ కోసం నిన్న ఆసుపత్రికి వెళ్లారు మల్లేశ్వరి(Pregnant Woman Dies). ఉమ్ము నీరు తక్కువగా ఉండటంతో టెస్టులు చేసి ఇంజక్షన్ ఇచ్చారు వైద్యురాలు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందింది గర్భిణి మల్లేశ్వరి. దీంతో ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు.
ఇక మరో వార్తను చూస్తే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మీ ప్రసాద్ పెన్షనర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 లక్షల డబ్బులతో పరారయిన సంగతి విదితమే. తాజాగా అతను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తను ఆన్లైన్ బెట్టింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నానని దీనితో అప్పులయ్యాయని వెళ్లడించాడు.
Pregnant Woman (7 Months) Dies Due to Injection Reaction..!