Bangla Test Series: బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు జట్టులో మార్పులు చేసిన బీసీసీఐ.. ఈ నెల 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్

ఈ నెల 14 నుంచి టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే, టీమిండియాలో పలువురు ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో, బీసీసీఐ జట్టులో మార్పులు చేసింది.

Credits: Twitter/BCCI

Newdelhi, Dec 12: టీమిండియా (Team India), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య ఈ నెల 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ (Two Test Series) జరగనుంది. అయితే, టీమిండియాలో పలువురు ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో, బీసీసీఐ (BCCI) జట్టులో మార్పులు చేసింది. మహ్మద్ షమీ (Shami) , రవీంద్ర జడేజా గాయాలతో టెస్టు సిరీస్ కు ఇప్పటికే దూరం కాగా, బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడిన రోహిత్ శర్మ కూడా తొలి టెస్టులో ఆడడంలేదు.

మూడో వన్డేలో టీమిండియా విజయం, ఇషాంత్ కిషన్ డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్ నడ్డివిరిచిన శార్ధూర్ ఠాకూర్, అక్షర్ పటేల్, భారీ టార్గెట్‌ను రీచ్‌ అవ్వలేకపోయిన బంగ్లాదేశ్‌

గాయపడిన ఆటగాళ్ల స్థానంలో అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను బీసీసీఐ ఎంపిక చేసింది. అదనంగా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement