COVID in Andhra Pradesh: గుడ్ న్యూస్, ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ సంఖ్య, తాజాగా 7,324 మంది కోలుకుని ఇంటికి, కొత్తగా 4,684 కేసులు నిర్ధారణ, ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్‌ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధారణ (COVID in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,62,036 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Coronavirus Outbreak | Representational Image (Photo Credits: PTI)

Amaravati, June 23: ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80,712 పరీక్షలు నిర్వహించగా.. 4,684 కేసులు నిర్ధారణ (COVID in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,62,036 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 36 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,452కి చేరింది.

24 గంటల వ్యవధిలో 7,324 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి (Covid-19 cases) చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,13,61,014 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో అయిదుగురు, కృష్ణాలో అయిదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్, ప్రకాశంలో ఇద్దరూ, విశాఖపట్నంలో ఇద్దరూ, కడపలో ఇకరు, గుంటూరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు.

Here's Covid Update

చిరంజీవి ట్వీట్‌కు రిప్లయి ఇచ్చిన సీఎం వైయస్ జగన్, ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి ఎంతగానో ఉందని తెలిపిన ముఖ్యమంత్రి

ఆర్టీసీ ఉద్యోగులకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. కోవిడ్‌ కర్ఫ్యూ సడలింపులు ఇవ్వడంతో బస్‌ సర్వీసులను అమాంతంగా పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రీజనల్‌ మేనేజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

గుడ్ న్యూస్..భారత్‌లో 29 కోట్లు దాటిన వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య, రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, తాజాగా 50,848 మందికి కరోనా, దేశంలో ప్రస్తుతం 6,43,194 కోవిడ్ పాజిటివ్‌ కేసులు

మొత్తం 55 వేల మంది ఉద్యోగుల్లో 45 ఏళ్ల దాటినవారు 33 వేల మంది ఉన్నారు. వారిలో 29 వేల మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్లు వేయగా, కేవలం 6 వేల మందికే రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. 45 ఏళ్లు దాటిన ఉద్యోగులందరికీ జూలై 31 నాటికి రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తి చేయాలని ఎండీ స్పష్టం చేశారు. తక్కినవారికి జూలై 31 నాటికి మొదటి డోసు వ్యాక్సిన్లు వేసి, ఆగస్టు 31 నాటికి రెండు డోసులు పూర్తి చేయాలన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement