Chittoor Shocker: చిత్తూరులో దారుణం, కానిస్టేబుల్ కూతురు గొంతు కోసిన యువకుడు, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి అక్కడికక్కడే మృతి
చిత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని ఓ యువకుడు గొంతు కోసి చంపేశాడు . ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Chittoor, April 18: చిత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని ఓ యువకుడు గొంతు కోసి చంపేశాడు . ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడి పేరు చక్రవర్తిగా గుర్తించారు. ప్రశాంతి ఆరు నెలలుగా కొండమిట్ట ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది.
ఈ బ్యూటీ పార్లర్ కు వచ్చిన చక్రవర్తి ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతి ప్రశాంతి ఓ కానిస్టేబుల్ కూతురుగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement