Andhra Pradesh: మరో ఏడాది పాటు ఐదు రోజుల పని దినాలు, చివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో 5 రోజుల పని విధానాన్ని పొడిగించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం

ఏపీలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ (AP Govt) పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు.

AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, July 1: ఏపీలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ (AP Govt) పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని (Working Days) పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్‌ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోసారి బస్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం, డీజిల్ సెస్ పేరుతో సామాన్యులపై భారం, పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎంతెంత పెంచారో తెలుసా? రూట్లను బట్టి డీజిల్ సెస్‌ వసూలు

సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement