Boat Capsizes In Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు.

Drowning | Representative Image (Photo Credits: ANI)

Vijayawada, Mar 4: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (Boat Capsizes In Rajamahendravaram) పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ (Boat) బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 20 మంది పడవలో సోమవారం రాత్రి లంకకు వెళ్లారు. వారిలో కొందరు తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ప్రమాద సమయంలో పడవలో 12 మంది ఉన్నారు.

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్

ప్రమాదాన్ని గమనించి..

పడవలోకి నీరు వచ్చినట్టు గమనించిన 10 మంది నదిలోకి దూకి ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరి కోసం అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం (54), రాజు (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్, నల్గొండ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి మల్క కొమురయ్య విజయం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement