AP Counting Day Arrangements: కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే

జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే.

TDP Polling Agents 'Assaulted and Kidnapped' in Punganur on Voting Day, Party Blames YSRCP

Vijayawada, May 28: జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections) కౌంటింగ్‌ కు (Counting) ఆంధ్రప్రదేశ్ (AP) సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని  వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం లెక్కింపు సందర్భంగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రైడే అమలు చేస్తున్నామని తెలిపారు.

పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారు, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఆ వాగ్దానాలను ‘అవినీతి’గా పరిగణించలేమని వెల్లడి

మరో 20 కంపెనీల బలగాలు

భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్టు మీనా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ నడుస్తున్నట్టు వెల్లడించారు.

క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధుల లక్షణాలు, అరవింద్ కేజ్రీవాల్ ఆకస్మిక బరువు తగ్గుదల, మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement