BC Janardhan Reddy Arrested: టీడీపీకి మరో ఎదురుదెబ్బ, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్‌, అనుచరులతో కలిసి వైసీపీ కార్యకర్త దుర్గాప్రసాద్‌పై రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలు, ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు

కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన టీడీపీ, వైసీపీ ఘర్షణ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని (BC Janardhan Reddy Arrested) పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేయగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జనార్ధన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని కూడా పోలీసులు అదుపులోకి (TDP Ex-MLA BC Janardhan Reddy Arrested) తీసుకున్నారు.

BC Janardhan Reddy Arrested (Photo-Facebook)

Kurnool, May 24: కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన టీడీపీ, వైసీపీ ఘర్షణ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని (BC Janardhan Reddy Arrested) పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేయగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో జనార్ధన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని కూడా పోలీసులు అదుపులోకి (TDP Ex-MLA BC Janardhan Reddy Arrested) తీసుకున్నారు.

అర్ధరాత్రి జనార్ధన్ రెడ్డిని (BC Janardhan Reddy) అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను డోన్‌ తరలించినట్లు తెలుస్తోంది. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది.

ప్రతి ఇంటికి ఆనందయ్య కరోనా మందు, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం, లేనిపోని ఆరోపణలు చేయవద్దు, మీడియాతో వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి

విజయవాడలో ఉండే అడ్రస్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని, విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత నెల 23న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. జైల్లో ఉండగానే ధూళిపాళ్ల కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ధూళిపాళ్ల చికిత్స పొందుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement