Leopard Caught in Tirumala: తిరుమల మెట్ల మార్గంలో చిన్నారిపై దాడిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కిందోచ్.. గత రాత్రి బోనులో పడిన చిరుత.. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ నిర్ణయం

రెండు రోజుల క్రితం తిరుమల నడక దారిలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లిపోయిన చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు.

Cheetah. Representational Image. (Photo credits: Twitter/ANI)

Tirumala, June 24: తిరుమల (Tirumala) నడక దారిలో మూడేళ్ల బాలుడిపై రెండు రోజుల క్రితం దాడి చేసిన చిరుత (Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలుడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లి తప్పించుకున్న చిరుతను అధికారులు ఒక్క రోజులోనే బంధించారు. దానిని పట్టుకునేందుకు  అధికారులు నిన్న రెండు బోన్లు ఏర్పాటు చేశారు. 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు (CC Cameras) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత రాత్రి 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడింది.

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. రాగల 5 రోజులు వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ

Andhra Pradesh: ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు, ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఈటీఎస్‌తో ఒప్పందం కుదర్చుకున్న జగన్ సర్కారు

గుంపులుగా పంపాలని..

చిరుత దాడిలో గాయపడిన బాలుడిని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ (3)గా గుర్తించారు. తొలుత తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని భాగాల్లో గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. చిరుత దాడి నేపథ్యంలో నడక మార్గంలో ఇకపై భక్తులను గుంపులుగా పంపాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement