Rains in Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. నేటి నుంచి 20 వరకు వర్షాలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
నేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.
Hyderabad, July 17: నేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు (Heavy Rains) పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ-IMD) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది. అదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంపై (Bay of Bengal) మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది.
ఐఎండీ సూచనలు ఇలా..
- జులై 17 నుంచి 20 వరకు- తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు
- జులై 18 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- జులై 17 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- జులై 17- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement