Maharashtra Accident: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Road Accident (Representational Image)

Mumbai, Sep 17: మహారాష్ట్రలో (Maharastra) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. తెల్లవారుజామున వేగంగా దూసుకెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులంతా తెలంగాణ (Telangana) వాసులేనని, పర్యాటన కోసం వచ్చి ప్రమాదం పాలయ్యారని అధికారులు తెలిపారు. వారంతా ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన వారని సమాచారం. అమరావతి జిల్లా చికల్దారా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

'Yashobhoomi' Inauguration: దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. రూ.5,400 కోట్లతో ప్రాజెక్ట్.. తొలి దశకు ప్రధాని ప్రారంభోత్సవం.. వీడియోతో

ప్రమాద సమయంలో కారులో నలుగురు

కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

PM Modi Birthday: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నేడు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యే పథకాలు ఇవే..వీటిలో మీకు ఏవి ఉపయోగపడతాయో ముందే తెలుసుకోండి..

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement